
HYDRA Commissioner Ranganath:హైడ్రా వార్షిక నివేదికను విడుదల చేసిన కమీషనర్ రంగనాథ్
- హైడ్రా ఇప్పటికే 200 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిందని హైడ్రా కమీషనర్ రంగనాథ్ తెలిపారు.
- శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హైడ్రా వార్షిక నివేదికను రంగనాథ్ విడుదల చేశారు.
- హైడ్రా ఏర్పడి దాదాపు 5 నెలలు దాటింది
- ఐదు నెలల అనుభవాలు, వచ్చే ఏడాది రూట్ మ్యాప్ సిద్దం చేశాం.
- ఓఆర్ ఆర్ వరకు హైడ్రా పరిది ఉంది.
- జీహెచ్ ఎంసీ చట్ట సవరణ ద్వారా ప్రభుత్వం ప్రత్యేక అధికారులు హైద్రాకు ఇచ్చింది
- 200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం
- 12 చెరువులు, 8 పార్కులను అన్యక్రాంతం కాకుండా హైడ్రా రక్షించింది.
- హైడ్రా చర్యలతో ఎఫ్ టీఎల్ , బఫర్ జోన్ పై ప్రజల్లో అవగాహన పెరిగింది.
- 1025 చెరువుల్లో వచ్చే ఏడాది ఎఫ్ టీఎల్ నిర్దారణ చేస్తాం.
- సాంకేతిక పరిజ్ఞానం, డాటాతో ఎఫ్ టీఎల్ నిర్దారణ చేస్తాం.
- ఎఫ్ టీఎల్ ను పారదర్శకంగా చేయడం మా బాధ్యత.
- శాటిలైట్ ఇమేజ్ తో అత్యంత రెజల్యూషన్ ఉన్న డేటా తీసుకుంటున్నాం.
- 2006 నుంచి 2023 వరకు ఏరియల్ డ్రోన్స్ తో తీసిన ఫొటోలను కూడా ఎఫ్ టీఎల్ నిర్దారణ కోసం తీసుకుంటున్నాం.
- ఎఫ్ టీఎల్ మారడానికి గల కారణాలు స్పష్టంగా తెలుస్తుంది.
- శాస్త్రీయమైన పద్దతుల్లోనే ఎఫ్ టీఎల్ నిర్దారణ జరుగుతుంది.
- నాలాలపై వివిధ సంస్థలు చేసిన స్టడీని పరిశీలించి చర్యలు తీసుకుంటాం.
- 5800 ఫిర్యాదులు హైడ్రాకు అందాయి.
- అనధికారిక నిర్మాణాలకు సంబంధించి 27 పురపారక సంఘాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి.
- 27 పురపాలక సంఘాలపై కూడా మాకు అధికారం ఉంది.
- శాటిలైట్ ఇమేజ్ ల ద్వారా ఆక్రమణలను గుర్తిస్తున్నాం.
- చెరువుల్లో భవన నిర్మాణ వ్యర్థాల డంపింగ్ పై కుడా దృష్టి పెట్టాం.
- 2025 లో జియో ఫెన్సింగ్ సర్వే చేయబోతున్నాం
- 12 చెరువుల పునరుద్దరణకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాం.
- ప్రస్తుతం 30 drf బృందాలున్నాయి. త్వరలోనే యివి 72 కాబోతున్నాయి.
- నాగోల్ లో ఉన్న డీఆర్ ఎఫ్ శిక్షణ కేంద్రాన్ని బలోపేతం చేస్తాం.
- యిప్పటి వరకు హైడ్రా drf బృందాలు 4684 ఫిర్యాదులను అటెండ్ అయింది .
- వందమంది drf సిబ్బంది ట్రాఫిక్ విధుల్లో పోలీసులకు సహాయం అందిస్తున్నారు.
- వాతావరణ హెచ్చరికల విభాగాన్ని పటిష్ట పరచనున్నాం.
- నగరంలో మరో డాప్లర్ వెదర్ రాడార్ ఏర్పాటు చేయాలని వాతావరణ శాఖను కోరాం.
- నగరంలో మరిన్ని ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు పెట్టబోతున్నాం.
- వెదర్ డాటాను విశ్లేషించేందుకు హైడ్రా లో ఒక టీంను ఏర్పాటు చేస్తున్నాం.
- హైడ్రా కు త్వరలో ఒక ఎఫ్ ఎం ఛానల్ కు ప్రయత్నిస్తున్నాం. దీనిద్వారా వాతావరణ హెచ్చరికలు ప్రజలకు చేర్చబోతున్నాం.
- హైడ్రా వల్ల ప్రజల్లో భూములు, ఇల్లు క్రయవిక్రయాలపై అవగాహన పెరుగుతుంది.
- నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా కఠినంగానే ఉంటుంది.
- జులై తర్వాత అనధికారికంగా, వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించేవాటిపై చర్యలు తప్పవు.
- వచ్చే ఏడాది నుంచి ప్రతిసోమవారం గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తున్నాం
- ఎఫ్ టీఎల్ లో ఉన్న షెడ్లపై ప్రజలెవరు అద్దెకు తీసుకోవద్దు
- ఆక్రమనలపై కాలనీ సంక్షేమ సంఘాలు,ప్రజలు ఇచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరిస్తున్నాం.
- ప్రజలు హైడ్రా కు సహకరిస్తున్నారు. చెరువులు, ప్రభుత్వ స్థలాలు, ప్రజావసరాల కు ఉద్దేశించిన స్థలాల పరిరక్షణకు హైడ్రతో కలసి పనిచేస్తున్నారు.